ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి
మన్మధ్లో చాకలి ఐలమ్మ, అన్నబావు సాటే విగ్రహాల ఆవిష్కరణ
ఎడ్దూర్-పొట్పెల్లి (బీ) సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
లోకేశ్వరం, జూన్ 5 : రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన యోధురాలు చాకలి ఐలమ్మ, సాహిత్య సామ్రాట్ లోక కవిగా పేరుగాంచిన అన్నబావు సాటే ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి పిలుపునిచ్చారు. లోకేశ్వరం మండలం మన్మధ్ గ్రామంలో ఆదివారం చాకలి ఐలమ్మ, అన్నబావు సాటే విగ్రహాలను స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ మాజీ జడ్పీ చైర్మన్ లోలం శ్యాంసుందర్, ఎంపీపీ లలితాభోజన్న, అన్నబాహు సాటే తాలుకా అధ్యక్షుడు ఉత్తమ్ బాలేరావు, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు సుంకెట పోశెట్టి, ఎమ్మార్పీఎస్ నాయకులు నందకుమార్, తుకారాం బాసర జడ్పీటీసీ రమేశ్, మండల సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ మండల కన్వీనర్ కరిపే శ్యాంసుందర్, పీఏసీఎస్ చైర్మన్ సిరిపురం రత్నాకర్ రావు, మండల యూత్ అధ్యక్షుడు కపిల్, సోషల్ మీడియా మండల కన్వీనర్ లక్ష్మణ్ రావు పటేల్, సుదర్శన్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, కుల సంఘం పెద్దలు, టీఆర్ఎస్ కార్యకర్త లు, ఇతర నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత..
ఎడ్దూర్-పొట్పెల్లి (బీ) గ్రామానికి చెందిన పండుగ పోశెట్టి కొడుకు ప్రదీప్ అనారోగ్యంతో బాధపడుతూ సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకున్నాడు. ఇందుకు రూ.42 వేలు మంజూరవగా, బాధితుడికి ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అందజేశారు. రా ష్ట్ర ప్రజల ఆరోగ్యం, భద్రతే ఎజెండాగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నవారి కోసం సీఎం సహాయనిధి, ఆరోగ్య శ్రీ ద్వారా చేయూతనందిస్తున్నట్లు చెప్పారు. సర్పంచులు రేఖాబాయి లక్ష్మణ్ పటేల్, శేఖర్ రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు మామిడి నారాయణ రెడ్డి, సోషల్మీడియా అధ్యక్షులు బండి ప్రశాంతి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు దిగంబర్, నాయకులు విఠల్ దాదా, మెండే శ్రీధర్, తుంగెన లక్ష్మణ్ రావు, శంకర్ గౌడ్, గ్రామస్తులు పాల్గొన్నారు.