మంథని టౌన్, జనవరి 23: పెద్దపల్లి జిల్లాకు చెందిన హెడ్కానిస్టేబుల్ గందం శంకర్ కేంద్ర ప్రభుత్వం అందించే ఉత్కృష్ఠ పతకానికి ఎంపికయ్యారు. మంథని మండలం బోయినిపేటకు చెందిన ఈయన 1998లో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. 2010లో హెడ్ కానిస్టేబుల్గా ఉద్యోగోన్నతి పొందారు. ప్రస్తుతం ఆయన మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేట టీఎస్పీఎస్-13 బెటాలియన్లో పనిచేస్తున్నారు. ఆయన అందించిన విశిష్ట సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పోలీసులకు అందించే ఉత్కృష్ఠ పతకానికి ఎంపిక చేసింది. ఈ నెల 26న ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ వేడుకల్లో శంకర్ ఈ పతకాన్ని అందుకోనున్నారు.