హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి రూ.744 కోట్ల ప్రతిపాదనలు పంపిస్తే.. కేంద్రం రూ.262.19 కోట్లు కేటాయించింది. ఈ మేరకు కేం ద్రప్రభుత్వం పార్లమెంట్కు లిఖితపూర్వకంగా తెలిపింది. గురువారం టీఆర్ఎస్ లోక్సభ పక్షనేత నామా నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఉపరితల రవాణశాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో 42 రహదారుల అభివృద్ధికి సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద రూ.744 కోట్ల నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం రెండు దఫాలు కోరిందని మంత్రితెలిపారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ. 262.19 కోట్లు కేటాయించామని, 2022-23 సంవత్సరంలో ఎంత కేటాయించేది ఆ ఏడాదిలోనే తెలియజేస్తామని స్పష్టం చేశారు.