హైదరాబాద్: నగరంలోని సికింద్రాబాద్లో భారీ ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ సమీపంలోని మెట్టుగూడలో (Mettuguda) శుక్రవారం అర్ధరాత్రి ఓ సిమెంట్ కాంక్రీట్ మిక్సర్ లారీ మెట్రో పిల్లర్ను ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పి రహదారిపై బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్ల సాయంతో కాంక్రీట్ మిక్సర్ లారీని తొలగించారు. ఈ ప్రమాదంలో డ్రైవర్కు గాయాలయ్యాయని, దవాఖానకు తరలించామని చెప్పారు. అర్ధరాత్రి సమయం కావడంతో భారీ ప్రమాదం తప్పిందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.