సిద్దిపేట : కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ వద్ద నిర్మించిన రంగనాయక సాగర్ ప్రాజెక్టు సీసీ కెమెరాల నిఘాలోకి రానుంది. ప్రాజెక్టు కట్టపై 32 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు నిశ్చయించారు. ఈ క్రమంలో భాగంగా ఇన్స్పెక్టర్ సురేందర్ రెడ్డి నేతృత్వంలోని పోలీసు అధికారుల బృందం, సీసీ కెమెరాల విక్రేతదారులు శనివారం ప్రాజెక్టును సందర్శించారు. ఏప్రిల్ 20 లోపు సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తి కానుందని ఇన్స్పెక్టర్ తెలిపారు.