కాజీపేట, జూలై 17 : ప్రతి కాలనీలో స్థానికులు సమష్ఠిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని కాజీపేట సీఐ గట్ల మహేందర్రెడ్డి సూచించారు. కాజీపేట 61వ డివిజన్ పరిధిలోని వెంకటాద్రినగర్కాలనీలో ఆదివారం సాయంత్రం కాలనీవాసులకు సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల నేరాలను అరికట్టవచ్చన్నారు. ఏదైనా సంఘటనలు జరిగితే నేరస్తులను తేలికగా గుర్తుపట్టవచ్చన్నారు. కాలనీ అభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో ప్రతి ఇంటి యాజమాని భాగస్వామ్యంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
నేరాల నియంత్రణకు సహకరించాలి
పట్టణంలో జరుగుతున్న నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కాజీపేట సీఐ గట్ల మహేందర్ రెడ్డి కోరారు. కాజీపేట చౌరస్తా, ఫాతిమానగర్ చౌరస్తాలో శనివారం అర్ధరాత్రి ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించారు. అనంతరం చిరువ్యాపారులతో సీఐ మాట్లాడుతూ కాజీపేట రైల్వే జంక్షన్లో ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుందన్నారు. ఈ క్రమంలో దొంగలు కూడా తిరిగే అవకాశం ఉందన్నారు. రాత్రివేళ అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. నిర్ధిష్ట సమయంలో దుకాణాలను మూసివేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్సైలు ఫణి, అపూర్వరెడ్డి, ప్రదీప్కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.