అహ్మదాబాద్: సొంతగడ్డపై ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్లో దుమ్మురేపిన టీమ్ఇండియా పొట్టి సిరీస్ కోసం సన్నద్ధమవుతోంది. ఇంగ్లీష్ జట్టుపై టెస్టు సిరీస్లో నెగ్గి ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్న కోహ్లీసేన టీ20 పట్టేయాలనే లక్ష్యంతో కసరత్తులు చేస్తున్నది. మార్చి 12 నుంచి మొతేరా స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి టీ20 ఆరంభంకానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్, యుజువేంద్ర చాహల్, హార్దిక్ పాండ్య నెట్స్లో సాధన చేశారు. ట్రైనింగ్ సెషన్కు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో పోస్ట్ చేసింది.