సీసీసీ నస్పూర్ : హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్ గెలుపు కోసం నస్పూర్ మున్సిపాలిటీకి చెందిన టీఆర్ఎస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, పార్టీ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య ఆధ్వర్యంలో కమలాపూర్ మండలం గుండేడు గ్రామంలో ఇంటింటికి తిరిగి టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్ధించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు కొండపర్తి శంకర్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు గర్శె రామస్వామి, కార్యదర్శి రాజలింగు, కౌన్సిలర్లు పూదరి కుమార్, బోయ మల్లయ్య, బౌతు లక్ష్మి, కోఆప్షన్ సభ్యుడు నాసర్, నాయకులు బండారు తిరుపతి, పులి రాజేందర్, జిన్నారపు రాజేశ్, పంబాల ఎరయ్య, తోకల సురేశ్యాదవ్, కుంభం రాజేశ్వర్రెడ్డి, రఫిక్ఖాన్, రవిగౌడ్, భవానీ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.