మేడ్చల్ కలెక్టరేట్, జనవరి 4 : బస్ షెలర్ట్ లేక ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాగారం మున్సిపల్ కార్యాలయం వద్ద బస్ షెల్టర్ లేకపోవడంతో ప్రయాణికులు బస్సుకోసం చెట్టు కింద నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి బస్ షెల్టర్ను నిర్మించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
అయితే బస్ షెల్టర్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలిస్తున్నామని, త్వరలోనే నిర్మిస్తామని నాగారం మున్సిపాలిటీ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి తెలిపారు. సమీపంలోనే మున్సిపల్ కార్యాలయం ఉండటంతో ప్రస్తుతమున్న బస్టాప్ ప్రయాణికులకు అనుగుణంగా లేదని పేర్కొన్నారు.