పహల్గామ్: కశ్మీర్లోని పహల్గామ్లో బస్సు నదిలో పడింది. ఆ బస్సులో ఐటీబీపీ జవాన్లు ప్రయాణిస్తున్నారు. ఆ బస్సులో మొత్తం 39 మంది భద్రతా సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. దాంట్లో 37 మంది ఐటీబీపీ, ఇద్దరు కశ్మీర్ పోలీసులు ఉన్నారు. ఫ్రిస్లాన్ వద్ద బస్సు బ్రేక్లు ఫెయిలవ్వడంతో.. ఆ బస్సు నదిలోకి దూసుకువెళ్లింది. అమర్నాథ్ యాత్ర వద్ద విధులు నిర్వర్తిస్తున్న జవాన్లు ఆ బస్సులో ఉన్నారు. చందన్వారి నుంచి పెహల్గామ్కు భద్రతా దళాలు ప్రయాణిస్తున్నాయి.
ఈ ప్రమాదంలో ఆరుగురు సైనికులు మృతిచెందినట్లు తెలుస్తోంది. గాయపడ్డ పోలీసుల్ని శ్రీనగర్లో హాస్పిటల్కు తరలించారు. బస్సు ప్రమాదంలో 30 మంది సైనికులు గాయపడినట్లు అనంతనాగ్ డాక్టర్ సయ్యిద్ తారిక్ తెలిపారు.
చందన్వారి ప్రమాదంలో ఐటీబీపీ సైనికుల మృతి పట్ల ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడ్డ సైనికులు త్వరగా కోలుకోవాలని కోరారు. గాయపడ్డవారికి సహాయ సహకారాలు అందిస్తున్నట్లు గవర్నర్ తెలిపారు.