న్యూఢిల్లీ: చాలా ఏండ్ల తర్వాత బీఎస్ఎన్ఎల్ లాభాల బాట పట్టినట్లు కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్వి నీ వైష్ణవ్ తెలిపారు. ఆపరేషనల్ ప్రాఫిట్లో బీఎస్ఎన్ఎల్ ఉందని ఆయన అన్నారు. 2019లో ప్రభుత్వం ఇచ్చిన 69వేల ప్యాకేజీతో ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ స్థిరమైన ఆపరేటర్గా మారినట్లు ఆయన చెప్పారు. స్వదేశీ రేడియో, 4జీ మొబైల్ నెట్వర్క్ సేవలను త్వరలో ఆవిష్కరించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది చివరిలోగా 5జీ సేవలను కూడా ప్రాంభించే అవకాశాలు ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. భారతీయ ఇంజినీర్లు 4జీ నెట్వర్క్ను తయారు చేశారని, దాన్ని త్వరలో లాంచ్ చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఇండియా ఎలా స్వయంగా 4జీ నెట్వర్క్ను డెవలప్ చేసిందని ప్రపంచం ఆశ్చర్యపోతోందని ఆయన అన్నారు. 4జీ బాటలోనే 5జీ నెట్వర్క్ను కూడా అభివృద్ధి చేస్తున్నామన్నారు. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఈ ఏడాది చివరిలో 5జీని లాంచ్ చేస్తామన్నారు. ఈ ఏడాది బడ్జెట్లో బీఎస్ఎన్ఎల్కు 44,720 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.