హైదరాబాద్ : హబీబ్నగర్(Habibnagar) పోలీస్ స్టేషన్ పరిధిలో ప్లంబర్(Plumber) దారుణ హత్యకు(Brutal murder )గురయ్యాడు. మద్యం మత్తులో ప్లంబర్ అయూబ్(39)ను అతడి మామ, బామ్మర్ది కొట్టి చంపిన ఘటన గురువారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మాసాబ్ట్యాంక్లో నివసించే అయూబ్ ప్లంబర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
కాగా, అయూబ్ మల్లేపల్లి ప్రైమ్ ఫంక్షన్ హాల్ సమీపంలోని జియాన్ అపార్టుమెంట్కు చేరుకున్నాడు. అక్కడ అతడి మామ మొహినుద్దీన్(60), బామ్మర్ది బాబా (28)తో తాగిన మైకంలో గొడవపడ్డాడు. ఈ క్రమంలో మొహినుద్దీన్, బాబా ఇద్దరి కలిసి అయూబ్ను కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయాడు. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే అయూబ్ను చికిత్స నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతూ అయూబ్ మృతి చెందాడు. ఉస్మానియా మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.