రామగిరి, మే 2: ‘కాంగ్రెస్ గూండాలను కాలమే శిక్షిస్తుంది. అధికారం వచ్చిన ఐదు నెలల్లోనే ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ, బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు. వాస్తవాలను ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. వాళ్లే తగిన బుద్ధి చెబుతారు’ అని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
రెండ్రోజుల క్రితం కాంగ్రెస్ నేతల దాడిలో గాయపడ్డ పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట తాజా మాజీ సర్పంచ్ భర్త బుర్ర శంకర్గౌడ్ను గురువారం ఆయన జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్తో కలిసి పరామర్శించారు. దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు.కాంగ్రెస్ నాయకులు ఎంతటి దాడులకు తెగించినా బీఆర్ఎస్ కార్యకర్తలు సంయమనం పాటించాలని, బీఆర్ఎస్ది దాడుల సంస్కృతి కాదని సూచించారు. వారికి కచ్చితంగా కాలమే సమాధానం చెబుతుందని అన్నారు.