RS Praveen Kumar | కాంగ్రెస్ నేత వివేక్ వెంకటస్వామి కుటుంబానికి పేద ప్రజల బాధలు తెలియవని నాగర్కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. ఆస్తులు కాపాడుకోవడం వివేక్ వెంకటస్వామి కుటుంబం ఆరాటపడుతుందని విమర్శించారు. గోదావరిఖనిలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బాల్క సుమన్, కొప్పుల ఈశ్వర్తో కలిసి గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
కేంద్రంలో బీజేపీ వస్తే ప్రాథమిక హక్కులు కోల్పోతామని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల తీసివేతకు కేంద్రం కుట్రలు చేస్తుందని ఆయన విమర్శించారు. బీజేపీ గెలిస్తే బహజనులు సర్వహక్కులు కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు. దేశంలో ఈడీ దాడులు సరికాదని అన్నారు. పంటలకు నీరందక రైతులు నష్టపోతున్నారని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ అంతా భూటకమని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్లను గద్దె దించాలని ప్రజలను ఈ సందర్భంగా కోరారు. తెలంగాణ ప్రయోజనాల కోసం కృషి చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిద్దామని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను అధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.