Marri Janaradhan Reddy | పార్టీ మారుతున్నట్లుగా వస్తున్న వార్తలపై నాగర్కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి స్పందించారు. అవన్నీ వట్టి పుకార్లనేనని స్పష్టం చేశారు. కొంతమంది పనిగట్టుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. పార్టీ మార్పు వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.
‘ నా ప్రియమైన BRS పార్టీ శ్రేణులకు, అభిమానులకు, నా నాగర్ కర్నూల్ నియోజకవర్గ ప్రజలకు, నా శ్రేయోభిలాషులకు మీ మర్రి జనార్దన్ రెడ్డి తెలియజేయునది ఏమనగా.. నేను పార్టీ మారుతున్నట్లు అని కొన్ని మాధ్యమాల్లో కొంత మంది పనిగట్టుకుని నాపై దృష్ప్రచారం చేస్తున్నారు,ఇట్టి విషయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నా చివరి శ్వాస వరకు బీఆర్ఎస్ పార్టీ అధినేత పెద్దలు కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశీస్సులతో BRS పార్టీలోనే కొనసాగుతూ పార్టీ పటిష్టత కోసం పనిచేస్తా, నా పార్టీ కార్యకర్తల కోసం, నా నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం BRS పార్టీలోనే కొనసాగుతానని మనస్పూర్తిగా తెలియజేస్తున్నాను’ అని తెలిపారు.