హైదరాబాద్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి హన్మంత్ షిండే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మూడురౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి హన్మంత్ షిండే 779 ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి షిండేకు 3472 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థికి 3412 ఓట్లు, బీజేపీ అభ్యర్థికి 1963 ఓట్లు వచ్చాయి.