ముషీరాబాద్, జనవరి 22: దేశానికి దిశ దశ చూపే రాజకీయ శక్తిగా బీఆర్ఎస్ పార్టీ ఆవిష్కృతం కాబోతుందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశ ప్రజలు గమనిస్తున్నారని, ఇదే తరహా అభివృద్ధిని దేశ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఆదివారం అడిక్మెట్ డివిజన్ సాయిచరణ్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఖమ్మం బహిరంగ సభతో బీఆర్ఎస్ పార్టీ సత్తా ఏమిటో కాంగ్రెస్, బీజేపీలకు అర్థమైపోయిందని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో 2024 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీలో వివిధ రాష్ర్టాల్లో ప్రజల మద్దతుతో సత్తా చాటబోతుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి కట్టుగా పని చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం, అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలని సూచించారు. నిత్యం ప్రజల మధ్య ఉండి పార్టీని మరింత పటిష్టపర్చాలని కోరారు. కేసీఆర్ నాయకత్వంలో తొమ్మిదేళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజల ముందుంచి వారి ఆదరణను చూరగొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఠా జయసింహ, బి. శ్రీనివాస్రెడ్డి, రవియాదవ్, సురేందర్, శ్యామ్సుందర్, మాధవ్, మహ్మద్ ఖదీర్, సయ్యద్ అస్లాం, ఖలీల్, అహ్మద్, నాగేశ్, గోపి, హరీశ్ తదితరులు పాల్గొన్నారు.
భోలక్పూర్లో బోనాల ఉత్సవాలు..
భోలక్పూర్ శ్రీ మహంకాళి దేవాలయంలో బోనాల ఉత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. స్థానిక గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ప్రతిఏటా జనవరిలో బోనాల ఉత్సవాలు నిర్వహించడం అనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఆలయం వద్ద భక్తుల కోలాహలం నడుమ బోనాలు కన్నుల పండువగా జరిగాయి. ఈ సందర్భంగా గంగపుత్రులు సాంప్రదాయ పద్ధతిలో పోతురాజులు, తొట్టెలు, చేపల వలలను డప్పు వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ అమ్మవారి ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే ముఠా గోపాల్, బీఆర్ఎస్ యూత్ విభాగం నేత ముఠా జయసింహ పాల్గొని పూజలు నిర్వహించారు. గంగపుత్ర సంఘం అధ్యక్షుడు కె.ఎం. శంకర్, ఆలయ కమిటీ చైర్మన్ గోవిందరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో బీఆర్ఎస్ నాయకులు వై. శ్రీనివాస్, బీజేపీ నేత సి.కె. శంకర్రావు, సంఘం నేతలు కె. సాయి, ఆనందరావు, వెంకటేశ్, శివ, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.