ఆసిఫాబాద్, మార్చి 22 : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా ఆలయంలో బీఆర్ఎస్ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాగోబా ఆలయ అభివృద్ధికి పెద్దపీట వేసినట్లు గుర్తు చేశారు. ఆదివాసుల సంసృతీ సంప్రదాయాలను గౌరవించిన వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు.
రాబోయే ఎన్నికల్లో తనను ఎంపీగా గెలిపిస్తే ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. మీ బిడ్డగా ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో ఆయనను ఘనంగా సతరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఆదివాసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.