రామకృష్ణాపూర్, ఏప్రిల్ 27 : రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఆశీర్వదించి గెలిపిస్తే.. అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తానని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. శనివారం రామకృష్ణాపూర్ ఠాగూర్ స్టేడియంలో మార్నింగ్ వాక్ నిర్వహించారు. అనంతరం సివిల్ ఆఫీస్, ఆర్కేపీ ఓసీపై సింగరేణి కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని కార్మికులు ముక్తకంఠంతో తెలిపారు. రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రిలో ఓట్లు అభ్యర్థించారు.
బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ప్రచారానికి విశేష స్పందన వచ్చింది. రామకృష్ణాపూర్లోని రాజీవ్చౌక్, బీ జోన్ సెంటర్లోని ప్రతి దుకాణానికీ వెళ్లి ప్రచార కరపత్రాలను అందజేశారు. ఆర్కేపీ సీహెచ్పీ కార్మికులు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు కంభగోని సుదర్శన్గౌడ్, పట్టణ ఇన్చార్జి గాండ్ల సమ్మయ్య, సీనియర్ నాయకుడు డా. రాజారమేశ్, టీబీజీకేఎస్ ఏరియా నాయకుడు మేడిపల్లి సంపత్, బడికెల సంపత్కుమార్, పిట్ కార్యదర్శులు, క్యాతనపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్లు జాడి శ్రీనివాస్, రేవెల్లి ఓదెలు, పారిపెల్లి తిరుపతి, అలుగుల శ్రీలత సత్తయ్య, నాయకులు రామిడికుమార్, ఆసాల రాజన్న, జక్కనబోయిన కుమార్, ఖలీమ్, యూత్ నాయకులు చంద్రకిరణ్, రామిడి లక్ష్మీకాంత్ పాల్గొన్నారు.