సీసీసీ నస్పూర్, ఏప్రిల్ 27 : కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని ప్రగతి పథంలో నడిపించి, దేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత కేసీఆర్దేనని బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పేర్కొన్నారు. శనివారం నస్పూర్లోని మంచిర్యాల జిల్లా పార్టీ కార్యాలయం లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్రావు, దుర్గం చిన్నయ్యతో కలిసి ఆయన పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం కార్యకర్తలకు పండ్లు పంపిణీ చేశారు.
బాల్క సుమన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రయోజనాలు, హక్కులు, పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి సా ధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చిన ఘనత కేసీఆర్దేనని కొనియాడారు. వేలాది మం ది తెలంగాణ బిడ్డలను పొట్టనబెట్టుకున్న కాంగ్రెస్కు, రాష్ర్టానికి నిధులివ్వకుండా వివక్ష చూపిన బీజేపీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అనతికాలంలోనే ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి కర్రుకాల్చి వాతపెట్టాలని పిలుపునిచ్చారు.
అవకాశవాద రాజకీయాలతో పార్టీలు మారుతూ.. కుటుంబ రాజకీయాలు చేస్తున్న గడ్డం ఫ్యామిలీకి పార్లమెంట్ ఎన్నికల్లో భంగపాటు తప్పదన్నారు. ఓటమితో కుంగిపోకుండా తెలంగాణ సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన తెలంగాణ తొలి సీఎం కేసీఆర్కు ప్రజలెప్పుడూ అండగా ఉంటారన్నారు. 26 ఏళ్ల పాటు సింగరేణి కార్మికుడిగా పనిచేసిన కొప్పుల ఈశ్వర్, వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతిగా ఉన్న గడ్డం వంశీ మధ్య జరుగుతున్న ఈ పోరులో అంతిమ విజయం కొప్పుల ఈశ్వర్దేనని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, కార్యదర్శి మేరుగు పవన్కుమార్, నాయకులు కేతిరెడ్డి సురేందర్రెడ్డి, మల్లెత్తుల రాజేంద్రపాణి, గోగుల రవీందర్రెడ్డి, రాజారమేశ్, బడికెల సంపత్కుమార్, పెట్టం లక్ష్మణ్, రఫీక్ఖాన్, గుమ్మడి శ్రీనివాస్, గౌస్, తిప్పని రామ య్య, వడ్లూరి రవి, అన్వేష్రెడ్డి, కాటం రాజు, వెంకటేశ్, అమృత రాజ్కుమార్, అడ్లకొండ రవిగౌడ్ పాల్గొన్నారు.
రామకృష్ణాపూర్, ఏప్రిల్ 27: క్యాతనపల్లి మున్సిపాలిటీలోని రామకృష్ణాపూర్లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్కట్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కంభగోని సుదర్శన్గౌడ్, పట్టణ ఇన్చార్జి గాండ్ల సమ్మయ్య, నాయకులు డా. రాజారమేశ్ పాల్గొన్నారు.