హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ యువ అథ్లెట్ నిత్య ఖాతాలో కాంస్య పతకం చేరింది. గతేడాది వరంగల్ వేదికగా జరిగిన 60వ జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో నిత్య..మహిళల 100 మీటర్ల రేసులో నాలుగో స్థానంలో నిలిచింది. అయితే ఇదే రేసులో పాల్గొని స్వర్ణ పతకం దక్కించుకున్న ఢిల్లీ అథ్లెట్ తరణ్జీత్కౌర్ తాజాగా డోపింగ్ టెస్టులో విఫలమైంది. దీంతో నిర్వాహకులు ఫలితాలను సవరించగా నిత్యకు కాంస్యం ఖరారైంది. మరోవైపు రానున్న కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల కోసం..తివేండ్రమ్లో జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ శిబిరంలో నిత్య, జ్యోతిక శ్రీ శిక్షణ పొందుతున్నట్లు జాతీయ కోచ్ నాగపురి రమేశ్ పేర్కొన్నారు. ప్రస్తుతం వీరు సాయ్ గోపీచంద్ మైత్రా ద్వారా సాయం పొందుతున్నట్లు తెలిపారు.