హైదరాబాద్: శంషాబాద్ విమానశ్రయానికి బాంబు బెదిరింపు (Shamshabad Airport) వచ్చింది. ఎయిర్పోర్టులో బాంబు ఉందంటూ దుండగులు ఈ-మెయిల్ పంపించారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికులను అప్రమత్తం చేసిన అధికారులు ఎయిర్పోర్టు పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై తమకు వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రయాణికులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని పేర్కొన్నారు.