Bomb Threat : కోర్టులకు బాంబు బెదిరింపులు ఈ మధ్యకాలంలో సర్వసాధారణం అయ్యాయి. ఇవాళ కూడా ఉదయం ములుగు జిల్లాకు బాంబు బెదిరింపు వచ్చింది. అయితే పోలీసులు తనిఖీ చేయగా.. ఎలాంటి బాంబు లేదని తేలింది. దాంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఆ ఘటనను మరువకముందే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం డిస్ట్రిక్ట్ కోర్టుకు బాంబుబెదిరింపు వచ్చింది.
కోర్టు ప్రాంగణంలో బాంబు ఉందంటూ జిల్లా న్యాయమూర్తికి మెయిల్ రావడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం బాంబు, డాగ్ స్క్వాడ్ బృందాలు ఘటనా ప్రాంతానికి చేరుకుని కోర్టు పరిసరాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. భద్రతా కారణాల దృష్ట్యా కోర్టు ప్రాంగణంలోకి ప్రజలను అనుమతించలేదు. ఈ తనిఖీల్లో బాంబు లేదని తేలడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.