WPL 2024 : మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ రేపటితో షురూ కానుంది. దాంతో టోర్నీ ఆరంభ వేడుకల్ని(Opening Ceremony) ఘనంగా నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. పలువురు సెలబ్రిటీలతో డాన్స్ షో ఏర్పాటు చేసింది. ఆరంభ వేడుకలో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్(Shah Ruh Khan) ప్రత్యేక ప్రదర్శన ఇస్తాడని బీసీసీఐ వెల్లడించింది.
ఇటీవలే ‘డుంకీ’ సినిమాతో ఫ్యాన్స్ను అలరించిన షారుక్.. తనదైన స్పెప్పులతో చిన్నస్వామి స్టేడియాన్ని హోరెత్తించేందుకు సిద్ధమవుతున్నాడు. షారుక్తో పాటు కార్తిక్ ఆర్యన్(Karthik Aryan),షేర్షా ఫేమ్ సిద్దార్థ్ మల్హోత్రా(Sidharth Malhotra), వరుణ్ ధావన్, షాహిద్ కపూర్, టైగర్ ష్రాఫ్లు సైతం తమ డాన్స్లతో ఫ్యాన్స్ను అలరించేందుకు రెడీ అవుతున్నారు.
🥁 Get ready folks
It’s none other than @iamsrk who will celebrate Cricket ka Queendom! 😍
Watch #TATAWPL 2024 Opening Ceremony on @JioCinema & @Sports18 LIVE from the M. Chinnaswamy Stadium, Bengaluru.
🗓️ 23rd Feb
⏰ 6.30 pm
🎟️ https://t.co/jP2vYAVWv8 pic.twitter.com/GzE6lLUmPS— Women’s Premier League (WPL) (@wplt20) February 21, 2024
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఫిబ్రవరి 23న డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ ఆరంభం కానుంది. సాయంత్రం 6ః30 గంటలకు ఓపెనింగ్ సెరమొనీని నిర్వహించనున్నారు. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తొలి మ్యాచ్లో తలపడనున్నాయి. మార్చి 15న ఎలిమినేటర్ పోరు. మార్చి 17న ఫైనల్ నిర్వహించనున్నారు.
Lights 💡
Camera 📸
And a whole lot of fun as the five Captains assembled for the Captains Day briefing.#TATAWPL season 2 starts on February 23.Get your tickets NOW at https://t.co/jP2vYAWukG! pic.twitter.com/6sAfod4QLV
— Women’s Premier League (WPL) (@wplt20) February 21, 2024
తొలి సీజన్లో ముంబైకే పరిమితమైన డబ్ల్యూపీఎల్.. రెండో సీజన్లో రెండు నగరాల్లో జరుగనుంది. ఐదు జట్లు బెంగళూరు, ఢిల్లీ వేదికగా 22మ్యాచ్లు ఆడనున్నాయి. అత్యధికంగా బెంగళూరులో 11 మ్యాచ్లు నిర్వహించనున్నారు. మార్చి 4 తర్వాత టోర్నీ మొత్తానికి ఢీల్లీ ఆతిథ్యం ఇవ్వనుంది. నిరుడు మాదిరిగా ఈసారి డబుల్ హెడర్స్ లేవు. పైగా రెండు వేదికల్లో మ్యాచ్లు నిర్వహించడంతో ఎక్కువ మంది ఫ్యాన్స్ స్టేడియాలకు తరలివచ్చే చాన్స్ ఉంది.