వీణవంక: టీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. వీణవంక మండలంలోని పలు గ్రామాల్లో గురువారం ఆయన హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ తరపున ప్రచారం నిర్వహించారు. ప్రతి గ్రామంలో ఇంటింటా తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ ఓ విజన్తో రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం కృషిచేస్తున్నారని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే హుజూరాబాద్ మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
నిరుపేద బిడ్డ అయిన గెల్లు శ్రీనివాస్యాదవ్కు ప్రజా సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉందని, వాటి పరిష్కారానికి ఎనలేని కృషిచేస్తాడని వినోద్కుమార్ చెప్పారు. ఈ ఉప ఎన్నికలో అందరూ కారు గుర్తుపైనే ఓటేసి, గెల్లు శ్రీనివాస్యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆయన వెంట వీణవంక మండల ఇన్చార్జి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, ఎంపీపీ రేణుకా తిరుపతిరెడ్డి, జడ్పీటీసి వనమాల సదాశివరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బాలకృష్ణారావు, రైతు బంధు సమితి అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, పార్టీ నాయకులు, తదితరులున్నారు.