సోన్భద్రా : లాంకోకు చెందిన పవర్ కార్పొరేషన్ ప్రాజెక్టులో బాయిలర్ కూలిపోయింది. ఈ ఘటనలో అక్కడ పనిచేస్తున్న 16 మంది కార్మికులు బాయిలర్ కింద చిక్కుకుపోయారు. వారిని సీఐఎస్ఎఫ్, ఇతర అధికారులు రక్షించి చికిత్స నిమిత్తం స్థానిక దవాఖానకు తరలించారు.
ఉత్తరప్రదేశ్లోని సోన్భద్రాలో లాంకో సంస్థకు 1200 మెగావాట్ల అన్పారా ‘సీ’ లాంకో థర్మల్ పవర్ స్టేషన్ ఉన్నది. ఆదివారం ఉదయం అకస్మాత్తుగా బాయిలర్ కుప్పకూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే పనిచేస్తున్న 16 మంది కార్మికులు బాయిలర్ కింద చిక్కుకుపోయారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, సీఐఎస్ఎఫ్ జవాన్లు రంగంలోకి దిగి ఇతర కార్మికుల సహాయంతో కూలీలందరినీ రక్షించారు. ఈ ఘటనలో 13 మంది కార్మికులు గాయపడ్డారు. వీరీలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నది. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న నెహ్రూ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాద వార్త తెలియగానే కార్మికులు, వారి కుటుంబాలంతా యూనిట్ వెలుపల గుమిగూడారు. ప్రాజెక్ట్ పరిధిలోని ప్రమాద స్థలానికి వెళ్లేందుకు పట్టుబట్టారు. పోలీసులు వారిని నిలువరించడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొన్నది. ఆందోళనకు దిగిన కార్మికులతో పోలీసు సూపరింటెండెంట్ అమరేంద్ర ప్రసాద్ సింగ్ మాట్లాడి వారిని శాంతపరిచారు. కార్మికుల చికిత్స కోసం తీసుకోవాల్సిన చర్యలపై దగ్గరుండి మరీ అధికారులను పురమాయించారు.
సంస్థలో పనిచేస్తున్న కార్మికులు అందించిన సమాచారం ప్రకారం, 1200 మెగావాట్ల అన్పారా ‘సీ’ లాంకో ప్రాజెక్టులో 600 మెగావాట్ల యూనిట్ నంబర్ 2 బాయిలర్ నిర్వహణ కోసం 80 మీటర్ల ఎత్తులో కార్మికులు పనిచేస్తున్నారు. ఇంతలో బాయిలర్ అకస్మాత్తుగా కుప్పకూలింది. ఆ సయమంలో అక్కడ 16 మంది పనిచేస్తున్నారు.
వారినందరినీ సీఐఎస్ఎఫ్ సిబ్బంది రక్షించారని కార్మికులు తెలిపారు. గంట పాటు ప్రయత్నించిన తరువాత కార్మికులందరినీ బయటకు తీసి చికిత్స అందించేందుకు స్థానిక నెహ్రూ దవాఖానకు తరలించారు. గాయపడిన వారిలో ఐదారుగురి పరిస్థితి విషమంగా ఉన్నదని కార్మికులు చెప్పారు.
ఉత్తరాఖండ్లో దావానలం.. 1200 హెక్టార్ల అడవి బుగ్గి
బిల్గేట్స్.. మైక్రోసాఫ్ట్.. పరిచయం అక్కర్లేని పేర్లు.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..