లక్నో : థర్మల్ విద్యుత్ ప్లాంట్లో బాయిలర్ పేలి 13 మంది కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం సోన్భద్ర జిల్లాలోని లాంకో అన్పారా థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది.
గాయపడిన వారి హుటాహుటిన సమీపంలోని దవాఖానకు తరలించారు. వీరిలో
ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం వారణాసికి పంపారు.
పోలీసులు ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. విద్యుత్ కేంద్రంలో చిక్కుకుపోయిన కార్మికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు.
ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా అధికారులకు సూచించారు.
ఘటనపై విచారణ చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి కారణాలు గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి