న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్లోని కీమెంగ్ సెక్టార్లో ఆదివారం కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో ఏడుగురు ఆర్మీ జవాన్లు గల్లంతు అయిన విషయం తెలిసిందే. అయితే ఆ సైనికుల మృతదేహాలను గుర్తించారు. రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన సైన్యం ఆ యోధుల మృతదేహాలను గుర్తించినట్లు తెలుస్తోంది. బోర్డర్ వద్ద గస్తీ నిర్వహిస్తున్న జవాన్లు తీవ్రమైన హిమపాతంలో చిక్కుకున్నారు. ఇటీవల కీమెంగ్ ప్రాంతంలో భారీగా మంచు కురుస్తోంది. దీంతో అక్కడ పలు ప్రాంతాల్లో మంచు చరియలు విరిగిపడ్డాయి. ఆ ప్రమాదంలో చిక్కుకున్న ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.