కొడంగల్ : రక్తదానం చేయడంవల్ల ప్రాణదానం చేసినంత ఫలితం ఉంటుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శనివారం స్థానిక తసీల్దార్ కార్యాలయంలో 75వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని ఇంచార్జి తాసీల్దార్ ఆనంద్ ఆధ్వర్యంలో లైఫ్కేర్ ఫౌండేషన్, నవోదయ ఆసుపత్రి వారు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. అదేవిధంగా డా.రవీంద్రయాదవ్ మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల కూడా శరీరంలో కొత్త రక్తం ఉత్పత్తి తో రక్త శుద్ధి జరుగుతుందని తెలిపారు.
సంవత్సరంలో ఓ సారి తప్పకుండా రక్తదానం చేస్తే ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. కొందరికి రక్తం ఇవ్వడం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయనే అపోహలు ఉంటాయి. అటువంటివి ఏమీఉండవని, రక్తం ఇవ్వడం వల్ల శరీరంలో కొత్త రక్తం ఉత్పత్తి అయ్యి ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఉంటుందని తెలిపారు. ఈ శిబిరంలో 60 మందికి పైగా రక్తదానం చేశారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికీ పండ్లు, ఎనర్జీడ్రింగ్, గుడ్డును అందించి, లైఫ్కేర్ ఫౌండేషన్ తరఫున సర్టిఫికెట్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముద్దప్ప దేశ్ముక్, మున్సిపల్ కౌన్సిలర్ మధుసూదన్యాదవ్, వైద్యులు డా.రతన్కుమార్, లైఫ్కేర్ ఫౌండేషన్ సిబ్బంది చంద్రకాంత్రెడ్డి, అనిల్తో పాటు తసీల్దార్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.