గోరఖ్పూర్: బీజేపీ ఎంపీ రవి కిషన్ను ముంబైకి చెందిన ఓ బిల్డర్ మోసం చేశాడు. సుమారు 3.25 కోట్ల చీటింగ్ చేసినట్లు రవి కిషన్ కేసు నమోదు చేశారు. వ్యాపారవేత్త జైన్ జితేంద్ర రమేశ్కు 2012లో రవి కిషన్ డబ్బు ఇచ్చాడు. ఆ మొత్తాన్ని వాపస్ ఇవ్వాలని కోరగా.. రమేశ్ ఆయనకు 34 లక్షలకు చెందిన 12 చెక్కులను అందజేశారు. అయితే గత ఏడాది డిసెంబర్ ఏడో తేదీన ఓ చెక్కును ఎస్బీఐలో డిపాజిట్ చేశారు. కానీ ఆ చెక్ బౌన్స్ అయినట్లు ఎంపీ కిషన్ తెలిపారు. రమేశ్ను మళ్లీ మళ్లీ అడిగా.. అతని వద్ద నుంచి సంతృప్తికర సమాధానం రాలేదన్నారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదు నమోదు చేసినట్లు పీఆర్వో పవన్ దూబే తెలిపారు.