Dharmapuri Arvind | సీఎం రేవంత్ రెడ్డిపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మామూలుగా అయితే సీఎం రేవంత్ రెడ్డి సమర్థుడు అని అన్నారు. అదే కాంగ్రెస్లో ఉంటే ఆయన అసమర్థుడిగా మారిపోతారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి చాలా రాజకీయ జీవితం ఉందని.. మరో 15 ఏళ్లపాటు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటారని అన్నారు. కానీ ఆయన ఉన్న కాంగ్రెస్ పార్టీకి మాత్రం భవిష్యత్తు లేదని అన్నారు. అందుకే భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలని హితవుపలికారు. బీజేపీలో చేరాలని ఆహ్వానించారు. రేవంత్ బీజేపీలోకి వస్తే ఓ స్నేహితుడిలా స్వాగతిస్తానని అన్నారు.
రేవంత్ రెడ్డి హిందువు అయితే జ్ఞానవాపి, మథురపై తన స్టాండ్ ఏంటో చెప్పాలని ధర్మపురి అర్వింద్ డిమాండ్ చేశారు. కేజ్రీవాల్ జైలు నుంచి పాలన చేయడాన్ని రేవంత్ రెడ్డి సమర్థిస్తున్నారని అన్నారు. అంటే రేవంత్ కూడా జైలు నుంచి పరిపాలన చేయడానికి ప్రిపేర్ అవుతున్నారా? అని ఎద్దేవా చేశారు.