శివ్పురి : తన ఎస్యూవీతో ఐదుగురు వ్యక్తులను గాయపరిచి రోడ్డు ప్రమాదానికి కారకుడైన తన కుమారుడిని పోలీసు స్టేషన్కు పిలిచి ప్రశ్నించినందుకు సబ్ డివిజనల్ పోలీసు అధికారి ఆయుష్ జాకఢ్ని 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, లేని పక్షంలో పేడతో ఇంటిని నింపివేస్తానని బెదిరించిన బీజేపీ ఎమ్మెల్యే ప్రీతమ్ లోధిపై మధ్యప్రదేశ్ ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం ప్రకటించింది. పిఛోర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మొదటిసారి ఎమ్మెల్యే లోధి ఉపయోగించిన అమర్యాదకర, బెదిరింపు భాషపై ఐపీఎస్ అధికారుల సంఘం అభ్యంతరం తెలిపింది.
ఎమ్మెల్యేపై రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సంఘం డిమాండ్ చేసింది. ఏప్రిల్ 16న జరిగిన రోడ్డు ప్రమాదంతో వివాదం రేకెత్తింది. లోధి కుమారుడు దినేశ్ లోధి తన థార్ జీపుతో ఐదుగురు వ్యక్తులను గాయపరిచినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనలో ముగ్గురు యువకులు, ఇద్దరు మహిళలు గాయపడ్డారు.