న్యూయార్క్, సెప్టెంబర్ 15: పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఎంతో మంచి తోచినంత సహాయం అందిస్తుంటారు. కానీ ఏకంగా వేల కోట్ల కంపెనీనే దానంగా ఇచ్చేశాడో అమెరికా బిలియనీర్.
పెటగోనియా ఫ్యాషన్ సంస్థ ఫౌండర్ యోవోన్ చుయ్నార్డ్ రూ.24 వేల కోట్ల విలువైన తన వాటాలు, కుటుంబ వాటాలన్నింటినీ ఓ స్వచ్ఛంద సంస్థకు బదిలీ చేశారు. ఈ మొత్తాన్ని వాతావరణ మార్పులు, జీవవైవిధ్యం, అటవీ భూముల సంరక్షణకు పాటుపడే సంస్థలు, కార్యక్రమాలకు వెచ్చించనున్నారు. సంస్థకు రాసిన లేఖలో.. ‘ఈ భూమే ఇప్పుడు మనకున్న ఏకైక వాటాదారు’ అని పేర్కొంటూ తన నిర్ణయాన్ని వెల్లడించారు.