బీబీనగర్: మండల పరిధిలోని బీబీనగర్ ఎయిమ్స్లో సౌత్ ఇండియా మెడికో లీగల్ అసోసియేషన్ వర్చువల్ విధానం ద్వారా వార్షిక అంతర్జాతీయ సమావేశం నిర్వహించినట్టు ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా తెలిపారు. ఈ సమావేశంలో 500 మంది ప్రతినిధులు, 150 పరిశోధన వ్యాసాలు సమర్పించారు.
ఈసందర్భంగా డైరెక్టర్ భాటియా మాట్లాడుతూ మెడికో లీగల్ పని కోసం అధునాతన హైఎండ్ టెక్నాలజీతో ఫోరెన్సిక్ విభా గాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో డీన్ డాక్టర్ రాహుల్ నరాంగ్, మెడికల్ సూపరింటెండెంట్ నీరజ్ అగర్వాల్, ఆర్టనైజింగ్ చైర్మన్ ప్రగ్నేశ్ పర్మార్, డాక్టర్ యుదుకుల్, ప్రశాంత్, దివ్యా రెడ్డి, పీఆర్వో శ్యామల తదితరులు పాల్గొన్నారు.