మాదాపూర్, ఆగస్టు 20: హైదరాబాద్లోని మాదాపూర్ ఖానామెట్లో కమ్మవారి సేవా సంఘాల సమాఖ్యకు ప్రభుత్వం కేటాయించిన 5 ఎకరాల స్థలంలో భవన నిర్మాణానికి శనివారం భూమి పూజ నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, మండవ వెంకటేశ్వర్రావు, విప్, కమ్మవారి సేవా సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వర్రావు, సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు చలసాని వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అరికెపూడి గాంధీ మాట్లాడుతూ.. తమ సంఘానికి 5 ఎకరాల స్థలం కేటాయించినందుకు కమ్మ సామాజిక కుటుంబాల తరఫున సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవనాన్ని సర్వ హంగులతో సుందరంగా నిర్మిస్తామని, వీలైనంత త్వ రలో పూర్తి చేసి సీఎం కేసీఆర్తో ప్రారంభోత్సవం చేసుకుంటామని చెప్పారు. ఇతరులకు ఉపయుక్తంగా ఉండేలా భవనాన్ని అందుబాటులో ఉంచుతామన్నారు.
నైపుణ్య శిక్షణ సహా మరెన్నో ప్రత్యేకతలకు ఈ భవనం వేదిక కాబోతున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం నేతలు గంగవరపు రామకృష్ణ ప్రసాద్, రత్నాకర్రావు, శ్రీనివాసరావు, రవిశంకర్రావు, చంద్రమౌళి, వెంకటేశ్వర్రావు, వంశీ, ఎంఎస్కే ప్రసాద్, చపరాల దాస్, సయోజీరావు, భాస్కర్రావు, వెంకటకృష్ణ, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.