హైదరాబాద్ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం నూతన కార్యనిర్వహణ అధికారి (ఈవో) భవానీ శంకర్ తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు ఆలయ అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. వేద పండితులు ఆశీర్వచనం చేశారు. అనంతరం ప్రధాన ఆలయంలోని స్వయంభు మూర్తులను దర్శించుకున్నారు.
కాగా, అంతకుముంద యాదాద్రి ఈవోగా ఉన్న వెంకట్రావు ఈనెల 2న తన పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఒత్తిళ్లతోనే ఆయన రాజీనామా చేసినట్లు తెలిసింది. కాంగ్రెస్ నేతలైన స్థానిక ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి వెంకట్రావుపై ఒత్తిడి పెంచి రాజీనామా చేసేందుకు పురికొల్పినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.