వంట గ్యాస్ ధర పెంపుపై మహిళా లోకం భగ్గుమన్నది. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు పెద్దఎత్తున ఆందోళనకు దిగింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మహిళలు ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. మోదీ డౌన్ డౌన్ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. రోడ్డుమీద వంటావార్పుతో నిరసన తెలిపారు. గ్యాస్ ధర తగ్గించకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సూర్యాపేటలో వేలాదిమంది మహిళలు ఆందోళనలో పాల్గొన్నారు. మంత్రి జగదీశ్రెడ్డి హాజరై వారికి మద్దతు తెలిపారు. నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు భాగస్వాములయ్యారు. ఆత్మకూరు.ఎం మండల కేంద్రంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ పాల్గొన్నారు. భువనగిరిలోనూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహిళలు పెద్దఎత్తున నిరసన తెలిపారు.
ఆత్మకూర్ (ఎం) మార్చి 24 : కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి డిమాండ్ చేశారు. గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ గురువారం మండల కేంద్రంలో కట్టెల పొయ్యి వెలిగించి వంట చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్, డీజిల్ ధరలను పెంచి వారి పొట్ట కొడుతుందని విరుచుకుపడ్డారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ బూరనర్సయ్యగౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బీసు చందర్గౌడ్, ఎంపీటీసీ యాస కవిత, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు రమేశ్గౌడ్, మహిళా విభాగం మండల అధ్యక్షురాలు సోలిపురం అరుణ, రైతు బంధు సమితి జిల్లా డైరెక్టర్ ధనలక్ష్మి, జయశ్రీ, లక్ష్మి, పద్మ, మాధవి పాల్గొన్నారు.
భువనగిరి అర్బన్ : కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్పై ధర పెంచడంతో టీఆర్ఎస్ పట్టణ, మండల కమిటీ ఆధ్వర్యంలో వినాయకచౌరస్తాలో వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధులు, నాయకురాలు ఆటోను తాడుతో లాగారు. రోడ్డుపై కట్టెలతో వంటావార్పు నిర్వహించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్గౌడ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గ్యాస్పై ధర పెంచడంతో సామాన్య ప్రజలపై మరింత భారం పడుతుందన్నారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్నదని విమర్శించారు. బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యం డీజిల్, పెట్రోల్ ధరలను పెంచుతూ సామాన్య ప్రజల నడ్డివిరుస్తుందన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నల్లమాస రమేశ్గౌడ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, పీఏసీఎస్ చైర్మన్ నోముల పరమేశ్వర్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, ఎంపీపీ నరాల నిర్మలావెంకటస్వామి, జడ్పీటీసీలు గోలి ప్రణీతాపింగళ్రెడ్డి, బీరు మల్లయ్య, రైతుబంధు సమితి మండల కన్వీనర్ కంచి మల్లయ్య, టీఆర్ఎస్ పట్టణ, మండలాధ్యక్షులు ఏవీ.కిరణ్కుమార్, జనగాం పాండు, నాయకులు రచ్చ శ్రీనివాస్రెడ్డి, నీలా ఓం ప్రకాశ్గౌడ్, ఎడ్ల రాజేందర్రెడ్డి, చందుపట్ల వెంకటేశ్వర్రావు, గోమారి సుధాకర్రెడ్డి, ర్యాకల శ్రీనివాస్, జక్క రాఘవేందర్రెడ్డి, నర్సింగ్రావు పాల్గొన్నారు.