హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత కొనసాగుతున్నది. ఉదయం, సాయంత్రం కమ్ముకుంటున్ను పొగమంచుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పొగమంచు వల్ల ప్రయాణాలకు జంకుతున్నారు.
పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా సాయం త్రం, రాత్రి చలి అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. సంకాంత్రి వరకు చలి ప్రభావం ఇలానే ఉంటుందని వెల్లడించింది. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించింది.