Health Tips : మండు వేసవిలో ఎండ వేడిమిని తట్టుకుని శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకునేందుకు పలు రకాల పానీయాలు తీసుకుంటారు. నీరు అధికంగా ఉండే పండ్లు, ఆహారాన్ని తీసుకునేందుకు మొగ్గుచూపుతుంటారు. వీటిలో ముఖ్యంగా తాజా పండ్ల రసాలను సమ్మర్లో ఆస్వాదించేందుకు ఇష్టపడతారు.
మధుమేహులు మాత్రం ఫ్రూట్ జ్యూస్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. అయితే అలాగని మధుమేహులు వేసవిలో ఫ్రూట్ జ్యూస్ల జోలికి వెళ్లకుండా ఉండాల్సిన అవసరం లేదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఏ జ్యూస్లను మధుమేహులు తీసుకోవాలి..ఏయే జ్యూస్లకు దూరంగా ఉండాలనే వివరాలను డైటీషియన్ శ్వేతా పాంచాల్ తన ఇన్స్టాగ్రాం పేజ్లో ఓ వీడియోలో వెల్లడించారు.
మధుమేహంతో బాధపడేవారు అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన మ్యాంగో జ్యూస్, వాటర్మెలన్ జ్యూస్, చెరకు రసం తీసుకోరాదని చెప్పారు. అయితే శరీరానికి తక్షణ శక్తిని అందించడంతో పాటు ఆరోగ్యానికి మేలు చేసే కొబ్బరి నీళ్లు, ఫ్రూట్ కూలర్స్, సబ్జా వాటర్, నిమ్మరసం వంటివి మధుమేహులు నిరభ్యంతరంగా తీసుకోవచ్చని ఆమె వివరించారు.
Read More :
PV Sindhu | తిరుమల శ్రీవారి సేవలో స్టార్ షట్లర్ పీవీ సింధు