రెబ్బెన : హుజురాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాసయాదవ్ గెలుపు కొసం బెల్లంపల్లి ఏరియా టీబీజీకేఎస్ శ్రేణులు ఆదివారం విస్తృత ప్రచారం నిర్వహించినట్లు టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు తెలిపారు. హుజురాబాద్లోని దినేశ్ గార్డెన్లో టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రులు హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కొరుకంటి చందర్, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డిలు హాజరుకాగా బెల్లంపల్లి ఏరియా నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరయ్యారని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఏరియా నుంచి కార్పొరేట్ చర్చల ప్రతినిధి ధరావత్ మంగిలాల్, కేంద్ర కమిటీ సభ్యులు అబ్బు శ్రీనివాసరెడ్డి, ఏరియా నాయకులు బూర శ్రీనివాస్, చిలుముల రాయలింగు, తదితరులు పాల్గొన్నారు.