జోహన్నస్బర్గ్: భారత్తో జరిగే టీ20 సిరీస్కు సౌతాఫ్రికా జట్టును ప్రకటించింది. టెంబ బవుమ ఆ జట్టుకు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టనున్నాడు. జూన్ 9 నుంచి 19 మంది ఇండియా, సౌతాఫ్రికా మధ్య అయిదు టీ20 మ్యాచ్లు జరగనున్నాయి. 21 ఏళ్ల వికెట్కీపర్ త్రిస్తాన్ స్టబ్స్కు జట్టులో స్థానం కల్పించారు. ఫాస్ట్ బౌలర్ అన్రిచ్ నోర్జాను ఎంపిక చేశారు. బ్యాటర్లు రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్లు కూడా జట్టుకు ఎంపికైన వారిలో ఉన్నారు. ప్రస్తుతం ఐపీఎల్లో ఆడుతున్న చాలా మంది దక్షిణాఫ్రికా ప్లేయర్లను జాతీయ జట్టుకు ఎంపిక చేసినట్లు క్రికెట్ సౌతాఫ్రికా ఒక ప్రకటనలో తెలిపింది. టీ20ల్లో ప్రస్తుతం దక్షిణాఫ్రికా నాలుగవ స్థానంలో ఉంది. జూన్ 9న ఢిల్లీలో, 12న కటక్లో, 14న వైజాగ్లో, 17న రాజ్కోట్లో, 19న బెంగుళూరులో టీ20 మ్యాచ్లు జరగనున్నాయి.
ఇదీ జట్టు..
టెంబ బవుమ(కెప్టెన్), డీకాక్, హెండ్రిక్స్, క్లాసెన్, కేశవ్ మహారాజ్, అదిన్ మాక్రమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జా, వేన్ పార్నెల్, డ్వెయిన్ ప్రిటోరియస్, కసిగో రబడ, తబ్రెయిజ్ షంషీ, త్రిస్తాన్ స్టబ్స్, రాసీ వాన్ డెర్ దుస్సెన్, మాక్రో జెన్సెన్.