హైదరాబాద్ : సింగపూర్లో బతుకమ్మ సంబురాలు వైభవంగా జరిగాయి. తెలంగాణ కల్చరల్ సొసైటీ (TCSS) ఆధ్వర్యంలో శనివారం జూమ్ ద్వారా వేడుకలను నిర్వహించారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా జరిగాయి. ఈ సందర్భంగా మిస్ యూనివర్స్ సింగపూర్-2021గా గెలిచిన తెలుగు యువతి నందిత బన్నను సొసైటీ సన్మానించారు. టీసీఎస్ఎస్ ఆధ్వర్యంలో ఏటా ఉత్సవాలు నిర్వహిస్తుండగా.. రెండు, మూడువేల మంది పాల్గొంటారు. అయితే, ఈ సారి కొవిడ్ నిబంధనల దృష్ట్యా 40 చోట్ల ఆన్లైన్ వేదికగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పలు రకాల పువ్వులతో అందంగా పేర్చి.. ఉయ్యాలపాటలు పాడుతూ ఆటలాడారు.
వేడుకల్లో టీసీఎస్ఎస్ అధ్యక్షుడు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్రెడ్డి, కోశాధికారి లక్ష్మణ్ రాజు కల్వ, సంస్థాగత కార్యదర్శి గడప రమేశ్బాబు, ఉపాధ్యక్షులు గర్రెపల్లి శ్రీనివాస్, గోనె నరేందర్ రెడ్డి, సునీత రెడ్డి, భాస్కర్ గుప్త నల్ల, ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్, జూలూరి సంతోష్ కుమార్, రోజా రమణి, నంగునూరి వెంకట రమణ, కార్యవర్గ సభ్యులు శ్రీధర్ కొల్లూరి, పెరుకు శివ రామ్ ప్రసాద్, నడికట్ల భాస్కర్, గార్లపాటి లక్ష్మా రెడ్డి, అనుపురం శ్రీనివాస్, శివ ప్రసాద్ ఆవుల, ప్రవీణ్ మామిడాల, శశిధర్ రెడ్డి, కాసర్ల శ్రీనివాస్, రవి కృష్ణ విజాపూర్ పాల్గొన్నారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా సంతోషి కూర.. సమన్వయ కర్తలుగా సునీత రెడ్డి, రోజా రమణి, జూలూరు పద్మజ, గర్రేపల్లి కస్తూరి, నర్రా నిర్మల, రాధిక, రోహిత, వందన వ్యవహరించారు.