Jayasuriya-Sachin | భారత్ క్రికెట్ ఆరాధ్య దైవం సచిన్ టెండూల్కర్తో తన అనుబంధంపై శ్రీలంక క్రికెట్ మాజీ ప్లేయర్ సనత్ జయసూర్య బయట పెట్టాడు. ఐపీఎల్ టోర్నీలో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైసీ తరఫున సచిన్తో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని చాలా ఎంజాయ్ చేశానని చెప్పాడు. 2008లో ఐపీఎల్ తొలి టోర్నీ నుంచి 2010 వరకు ముంబై జట్టుకు జయసూర్య ప్రాతినిధ్యం వహించాడు. ఈ సందర్భంగా సచిన్తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు.
ముంబై ఇండియన్ ఫ్రాంచైసీ యాజమాన్యం తమకు స్వేచ్ఛనిచ్చిందని జయసూర్య పేర్కొన్నాడు. ఏ విధంగా ఆడినా, పరుగులు చేస్తే చాలునని పేర్కొందని అన్నాడు. సచిన్ టెండూల్కర్తో కలిసి బ్యాటింగ్ అంటే చాలా రిలాక్సింగ్గా ఉండేదని సనత్ జయసూర్య పేర్కొన్నాడు. తామిద్దరం అనుకున్న ప్లాన్ను ఖచ్చితంగా అమలు చేసి జట్టుకు విజయం సాధించి పెట్టేవారం అని అన్నాడు. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైసీ జట్టులో సచిన్తోపాటు జయసూర్య ఓపెనర్లుగా ఆడారు.
టీం ఇండియా మాజీ ప్లేయర్ హర్బజన్ సింగ్ కూడా తమతో సరదాగా ఉండేవాడని జయసూర్య అన్నాడు. డ్రస్సింగ్ రూమ్లో తమను నవ్వించే వాడని అన్నాడు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను సంపాదించుకున్న జయసూర్య.. సచిన్ టెండూల్కర్లు శ్రీలంక, భారత్ తరపున పోటీ పడ్డారు.