బెంగళూర్ : క్యాంపస్లో గణేష్ ఆలయ నిర్మాణానికి వ్యతిరేకంగా బెంగళూర్ యూనివర్సిటీ విద్యార్ధులు నిరసన చేపట్టారు. ఆలయం స్ధానంలో లైబ్రరీ నిర్మించాలని ఆలయ నిర్మాణాన్ని విద్యార్ధులు వ్యతిరేకిస్తున్నారు.
రిజిస్ట్రార్, వైస్చాన్స్లర్లకు తమ వ్యతిరేకతను తెలిపినా బ్రుహత్ బెంగళూర్ మహానగర పాలిక (బీబీఎంపీ) యూనివర్సిటీ ప్రాంగణంలో ఆలయ నిర్మాణాన్ని చేపడుతున్నదని విద్యార్ధులు ఆందోళన వ్యక్తం చేశారు. క్యాంపస్లో ఆలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్ధులు పెద్దసంఖ్యలో నిరసనకు దిగారు.
యూజీసీ మార్గదర్శకాల ప్రకారం యూనివర్సిటీ విద్యను, జ్ఞానాన్ని పొందడానికని, మత విశ్వాసాలు ఆచరించడానికి కాదని విద్యార్ధులు అన్నారు. యూనివర్సిటీని కాషాయీకరించేందుకు బీబీఎంపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వర్సిటీ కాషాయీకరణ కోసం ఆలయ నిర్మాణానికి నిధులు వెచ్చిస్తోందని విద్యార్ధులు పేర్కొన్నారు.