ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 26: ఉస్మానియా యూనివర్సిటీ టెక్నాలజీ కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులందరూ తోడ్పడాలని హర్యానా గవర్నర్ దత్తాత్రేయ పిలుపునిచ్చారు. ఈ కళాశాలలో చదివిన విద్యార్థులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నత స్థానాల్లో ఉన్నారన్నారు. ఓయూ టెక్నాలజీ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా దత్తాత్రేయ హాజరయ్యారు. కార్యక్రమంలో ఉమ్మడి ఏపీ సీఎం మాజీ కార్యదర్శి చామర్తి ఉమామహేశ్వర్రావు, ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్, టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ చింత సాయిలు, కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధులు ప్రొఫెసర్ వెంకటేశ్వర్, రాజమహేందర్రెడ్డి, రాములు, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ప్రభాకర్రెడ్డి, ప్రొఫెసర్ కవితావాఘ్రే, ప్రొఫెసర్ రమేశ్కుమార్, ప్రొఫెసర్ శ్యాంసుందర్, ప్రొఫెసర్ జయప్రకాశ్, ప్రొఫెసర్ శ్రీనునాయక్, డాక్టర్ పరశురాం, కోదండరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.