మంత్రి కేటీఆర్కు విప్ సుమన్, ఎమ్మెల్యేల వినతి
మంచిర్యాల (నమస్తే తెలంగాణ), జూన్ 7 : నియోజకవర్గాలు, మున్సిపాలిటీల అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేయాలని చెన్నూర్ ఎమ్మెల్యే, విప్ బాల్క సుమన్, మంచిర్యాల, బెల్లంపల్లి, ఖానాపూర్ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్రావు, దుర్గం చిన్నయ్య, రేఖానాయక్ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ను కోరారు.
మంగళవారం హైదరాబాద్లో ఆయనను నేరుగా కలిసి విజ్ఞప్తి చేశారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు వారు పేర్కొన్నారు.