హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమ రూపకర్త సంతోష్కుమార్ అరుదైన గౌరవం లభించింది. జైపూర్లోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ మేనేజ్మెంట్లో ఏప్రిల్ 3న నిర్వహించనున్న ‘బ్యాక్ టూ రూట్’ కార్యక్రమానికి హరిత్ భారత్ 108 సంస్థ ఆహ్వానం పం పింది.
ఈ కార్యక్రమానికి యూఎన్ఈపీ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోైల్హెమ్తోపాటు, ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన విష్ణు లాంబతో సంతోష్కుమార్ హాజరుకానున్నారని ట్విట్టర్లో తెలిపింది. హరిత్ భారత్ ప్రకటనపై సంతోష్కుమార్ హర్షం వ్యక్తంచేశారు. ఎంతో గౌరవమైన ఆహ్వానం అందిందని ట్వీట్ చేశారు.