హోబర్ట్: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా 4-0తో యాషెస్ సిరీస్ చేజిక్కించుకుంది. మూడు రోజుల్లోనే ముగిసిన ఆఖరి టెస్టులో ఆసీస్ 146 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను చిత్తుచేసింది. 271 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 124 పరుగులకే ఆలౌటైంది. క్రాలీ (36) టాప్ స్కోరర్ కాగా.. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, బొలాండ్, కామెరూన్ గ్రీన్ తలా మూడు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 303 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 188 రన్స్కు ఆలౌటైంది. అనంతరం కంగారూలు రెండో ఇన్నింగ్స్లో 155 పరుగులు చేశారు. టోర్నీ ఆసాంతం రాణించిన ట్రావిస్ హెడ్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’తో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.