భువనగిరి అర్బన్: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరుతున్నారని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్లోని ఎమ్మెల్యే ప్రత్యేక కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు, భువనగిరి మాజీ ఎంపీపీ కేశవపట్నం రమేశ్కు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి టీఆర్ఎస్ పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వనించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలంగాణ ప్రభుత్వంతోనే సాధ్య పడుతుందని, బంగా రు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములం కావాలని పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆ ర్ ప్రవేశపెడుతున్న పథకాలతో గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతున్నాయన్నారు. పల్లెప్రగతితో గ్రామాలు సుందరీకర ణంగా మారాయన్నారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామాల అభివృద్ధిలో ఏ విధంగా మార్పు వచ్చిందో, ప్రజల మౌలిక వసతులు ఎలా మెరుగు పడ్డాయో వాటిని చూసి పార్టీలోకి చేరుతున్నారని అన్నారు. ప్రభుత్వ పథకాలతో నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అన్ని హంగులలో అభివృద్ధి చేస్తానని తెలిపారు.
కార్యక్రమంలో మండలాధ్యక్షుడు జనగాం పాండు, ప్రధాన కార్యదర్శి నీల ఓంప్రకాశ్గౌడ్, నాయకులు మధుసూదన్రెడ్డి, అతికం లక్ష్మీనారాయణ, సందెల సుధాకర్, రాఘవేందర్రెడ్డి, నర్సిరెడ్డి, లక్ష్మయ్య, ధనంజయ్, ఆయా గ్రామాల సర్పం చ్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.