న్యూఢిల్లీ: ఇవాళ రాత్రి 12.15 నిమిషాలకు సూర్య గ్రహణం పట్టనున్నది. భారత కాలమానం ప్రకారం.. శనివారం రాత్రి అంటే.. ఆదివారం ఆ గ్రహణం కనిపించనున్నది. అంటార్కిటికా, దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్ సముద్ర తీరాల్లో ఈ గ్రహణాన్ని వీక్షించవచ్చు. చిలీ, అర్జెంటీనా, ఉరుగ్వే, పరాగ్వే, బొలివియా, పెరూ, బ్రెజిల్ దేశాల్లో గ్రహణాన్ని ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. బ్యూనస్ ఏరిస్, ఫాల్క్లాండ్, మచు పిచు బేస్, మాంటివిడో, శాంటియాగో పట్టణాల నుంచి సూర్య గ్రహణాన్ని వీక్షించవచ్చు అని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఏడాది రెండు పాక్షిక సూర్య గ్రహణాలు ఉన్నాయి. దాంట్లో ఇవాళ్టిది మొదటిది. రెండవది ఈ ఏడాది అక్టోబర్ 25వ తేదీన కనిపించనున్నది. అయితే ఇవాళ రాత్రి జరిగే సూర్య గ్రహణం ఇండియాలో కనిపించదు. కానీ ఆన్లైన్లో ఆ గ్రహణాన్ని వీక్షించవచ్చు. శనివారం సంభవించే సూర్య గ్రహణాన్ని బ్లాక్మూన్గా కూడా పిలుస్తున్నారు.